చిత్తూరులో సెక్స్ రాకెట్.. దాడికి దిగిన పోలీసులు

గుట్టుచప్పుడు కాకుండా కొందరు యథేచ్ఛగా వ్యభిచార గృహాలను నడుపుతున్నారు.

ప్రభుత్వం, పోలీస్ అధికారులు మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం పాటించాలని చెప్తున్నా అవేవీ పట్టించుకోకపోగా స్వలాభం కోసం వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తూ ఆడవాళ్ల శరీరంతో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.ఆ గృహానికి యువకులు అధిక సంఖ్యలో రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

ఈ మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించి నిర్వాహకుడిని, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

మదనపల్లి పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో చంద్రగిరికి చెందిన ఓ మహిళ, మరో ఇద్దరుతో కలిసి ఇతర ప్రాంతాల యువతులతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాన్నినడుపుతున్నారు.ఆ ఇంటికి యువకులు అధిక సంఖ్యలో రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిర్వాహకులతో పాటు ఏడుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు సెక్స్ వర్కర్లకు కరోనా పరీక్షలు నిర్వహించి యువతుల కుటుంబసభ్యులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు.

సీఐ రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు