దేవాకు తేజూ హ్యాండ్‌ ఇవ్వడు కదా?

దర్శకుడు దేవా కట్టకు ట్యాలెంట్‌ ఉన్న దర్శకుడిగా పేరు ఉంది.

కాని ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పర్చడంతో ఆయనకు స్టార్‌ హీరోల సినిమాలకు ఛాన్స్‌ దక్కలేదు.

చాలా సినిమాలు ఆయన చేతి వరకు వచ్చి చేజారి పోయాయి.తాజాగా మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక చిత్రాన్ని ఈయన దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు.

వీరిద్దరి కాంబోలో ఒక భారీ యాక్షన్‌ పొలిటికల్‌ డ్రామా రూపొందబోతుందట.ఈ చిత్రం కోసం తేజ్‌ చాలా ప్రత్యేకంగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

సినిమా షూటింగ్‌ అధికారికంగా ప్రారంభం అయ్యింది.కరోనా సమయం అవ్వడంతో షూటింగ్‌ను ముందుకు తీసుకు వెళ్లడం లేదు.

Advertisement

ఈ సమయంలోనే గోపాల్‌ అనే దర్శకుడి దర్శకత్వంలో భగవద్గీత సాక్షిగా అనే చిత్రాన్ని చేసేందుకు సాయి ధరమ్‌ తేజ్‌ ఓకే చెప్పాడట.ఆ కథకు చిరంజీవి కూడా ఓకే చెప్పడంతో వెంటనే సినిమాను మొదలు పెట్టాలని మెగా కాంపౌండ్‌ చాలా ఉత్సాహంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

దేవా కట్ట సినిమా కంటే ముందు గోపాల్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గోపాల్‌ తక్కువ బడ్జెట్‌తో సినిమాను పూర్తి చేస్తానంటూ చెబుతున్నాడట.సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్రాన్ని విడుదలకు రెడీ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఉబలాటంగా ఉన్నాడు.

ఆయనకు దేవకట్టాతో సినిమా అంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.అందుకే గోపాల్‌తో వెళ్లబోతున్నాడు.ఆ తర్వాత అయినా దేవా కట్ట తో సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు