దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.
ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలను క్రియేట్ అయ్యాయి.
కాగా లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండు నెలలకుపైగా వాయిదా పడింది.ఇప్పుడు షూటింగ్లకు అనుమతి లభించడంతో చాలా తక్కువ మందితో షూటింగ్ నిర్వహించాలనే ప్రభుత్వ సూచన మేరకు దర్శకుడు రాజమౌళి హీరోల డూప్లతో ట్రయిల్ షూట్ నిర్వహించాలని భావించాడు.
కానీ ఈ ట్రయిల్ షూట్ను రద్దు చేస్తున్నట్లు జక్కన్న ప్రకటించడంతో అందరూ అవాక్కయ్యారు.అయితే ఆర్ఆర్ఆర్ టీమ్కు పోలీసుల పర్మిషన్ లభించలేదనే కారణంగా ఈ ట్రయిల్ షూట్ రద్దయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.
అయితే ఈ షూట్ రద్దు కావడానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ షూటింగ్ను డూప్లతో కాకుండా చిత్ర హీరోలతోనే చేయించాలని జక్కన్న భావిస్తున్నాడట.
డూప్లతో ట్రయిల్ షూట్ చేస్తే నిర్మాతకు అదనపు బడ్జెట్ భారం అవుతుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పరిస్థితులు మరింత చక్కబడ్డాక ఈ చిత్ర షూటింగ్ను నిర్వహించాలని రాజమౌళి నిర్ణయించాడట.
మొత్తానికి కరోనా వైరస్ కారణంగా ఎలాంటి రిస్క్ తీసుకోవద్దనే రాజమౌళి ఇలా చేశాడని తెలుస్తోంది.మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy