మణిరత్నం పీరియాడికల్ సినిమా చేయడం లేదు అంటున్న హైదరీ

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అందరూ అంటారు.కాని ఈ మాట హైదరాబాదీ భామ అదితీరావు హైదరీ విషయంలో డిఫరెంట్.

ఆమె ముందుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రూవ్ చేసుకొని సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ కి భిన్నంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటుంది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈమె గతంలో మణిరత్నం దర్శకత్వంలో కార్తికి జోడీగా చెలియా అనే సినిమాలో నటించింది.ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

Advertisement

మణిరత్నం ప్రస్తుతం పోన్నియన్ సెల్వన్ అనే పీరియాడికల్ కథాంశంతో తమిళంలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

పాన్ ఇండియా మూవీగా దీనిని ఆవిష్కరిస్తున్నారు.ఐశ్వర్యరాయ్ లాంటి అందాల భామ ఇందులో నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అదితీరావు హైదరీని తీసుకున్నట్లు గత కొంత కాలంగా టాక్ వినిపిస్తుంది.అయితే ఈ సినిమాలో తాను అంటించడం లేదని ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది.

అయితే మణిరత్నం సినిమాలో చిన్న పాత్ర వచ్చిన తాను చేయడానికి సిద్ధం అని మరో హింట్ కూడా ఇచ్చింది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు