సుజీత్ పై చిరు నమ్మకం కు కారణం ఇదేనా?

మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రం దాదాపుగా ఖరారు అయ్యింది. మెగా 153 మూవీ లూసీఫర్‌ రీమేక్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీలో మెగాస్టార్‌ చిరంజీవి నటించేందుకు రెడీ అయ్యారు.ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా కథను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

భారీ అంచనాలున్న ఈ రీమేక్‌ను కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న సుజీత్‌ చేతిలో పెట్టడం అందరికి ఆశ్చర్యంను కలుగజేస్తోంది.

ఇంతకు అంతటి మెగా ప్రాజెక్ట్‌ సుజీత్‌ చేతులకి ఎలా వచ్చిందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.సాహో చిత్రంతో సుజీత్‌ క్రేజ్‌ బాగా పెరిగింది.అయితే మెగాస్టార్‌ సినిమా దక్కించుకునేంత మాత్రం సుజీత్‌ ఏం చేశాడబ్బా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇలాంటి సమయంలో మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం స్వయంగా చిరంజీవి ఈ ఆఫర్‌ను సుజీత్‌కు చేశాడని, సుజీత్‌పై చాలా నమ్మకంతో చిరంజీవి ఉన్నట్లుగా వారు చెబుతున్నారు.

సాహో చిత్రంలో చాలా మంది స్టార్స్‌ను దర్శకుడు సుజీత్‌ చూపించాడు.పెద్ద స్టార్స్‌ను చాలా బాగా చూపించడంతో పాటు అన్ని పాత్రలకు కూడా న్యాయం చేసేలా సుజీత్‌ స్క్రీన్‌ప్లేరాసుకున్న తీరు బాగుందని, అందుకే లూసీఫర్‌ వంటి ఎక్కువ మంది స్టార్స్‌ ఉండే సినిమా సుజీత్‌ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయంకు చిరంజీవి వచ్చాడని వారు చెబుతున్నారు.లూసీఫర్‌ ఆఫర్‌ దక్కించుకున్న సుజీత్‌ ఆచార్య పూర్తి అయిన తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో చిరంజీవిని డైరెక్ట్‌ చేయబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు