మరోసారి తన దాతృత్వంను చాటుకున్న పవన్‌.. ప్రతి ఒక్క జనసైనిక్స్‌ గర్వించదగ్గ విషయం

పవన్‌ కళ్యాణ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన తన వద్దకు సాయం కోసం వచ్చే వారికి కాదనకుండా సాయం చేస్తాడనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.

సాయం కోరని వారికి కూడా పవన్‌ చాలా సార్లు సాయం చేశాడు.

ఆమద్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులకు కొంత మొత్తంలో తన చేతిలోంచి ఇచ్చిన పవన్‌ ఓడిపోయిన తర్వాత కూడా తన దాతృత్వంను కనబర్చుతూనే ఉన్నాడు.తనకు చేతనైన సాయంను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాడు.

ఆమద్య ఒక దేవాలయంకు కోటి విరాళం ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు దేశ రక్షణలో భాగంగా నిలిచే ఆర్మీ వారి కోసం ఏకంగా కోటి విరాళంను ప్రకటించాడు.కొన్ని వందల కోట్లు ఉన్న వారు కూడా ఆర్మీ వారి కోసం ఆర్మీ వారి సంరక్షణ నిధి కోసం లక్షల సాయం చేసేందుకు ముందుకు రారు.

కాని పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఈ విషయంలో చాలా గొప్పవాడిగా పేరు దక్కించుకున్నాడు.తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ సాయుద బలగాల కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు సైనిక్‌ బోర్డ్‌కు కోటి విరాళంను పవన్‌ ప్రకటించాడు.

Advertisement

పవన్‌ అభిమానులు ఈ విషయంను గొప్పగా చెప్పుకోవచ్చు.ఆయన అభిమానులు అయినందుకు గర్వించవచ్చు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు