యంగ్ రెబెల్ స్టార్ గా పిలవబడే ప్రభాస్ బాహుబలి తరువాత చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సాహో.ఈ చిత్రం ఎప్పుడు ధియేటర్స్ కు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఆగస్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కు సిద్దమౌతున్న ఈ సమయంలో ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గురు రంధవా పై కొందరు దాడి చేసినట్లు తెలుస్తుంది.ఈ యువ కంపోజర్ కెనడా లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం కోసం అని వెళ్లగా అక్కడ కొంతమంది దాడి చేశారు.
కారణం లైవ్ కాన్సెర్ట్ లో పాల్గొని స్టేజ్ పై లైవ్ ఇచ్చేందుకు వెళుతున్న సమయంలో గార్డులు ఆయనను ఆపేశారు.ఈ సమయంలో ఆయనపై దాడి చోటుచేసుకోవడం తో ఆయన స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది.
అయితే ఒక్క కంటిపై మాత్రం బలమైన గాయం కావడంలో కుట్లు కూడా వేసినట్లు తెలుస్తుంది.
అయితే ఈ ఘటన జరగడం తో అక్కడే ప్రాధమిక చికిత్స తీసుకున్న అనంతరం గురు తిరిగి ఇండియాకు కూడా వచ్చేశారట.
అయినా అయిపోయిన విషయం ఎప్పుడు తెలిసినా నెటిజన్లు ఊరుకుంటారా మరి.ఇక ఈ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.







