పవన్ కళ్యాణ్ మరో కొత్త స్కెచ్! గోదావరి ఒడ్డున ఫిలిం స్కూల్

జనసేన పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడుగా మారిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలకి స్వస్తి చెప్పేసాడు.

ఇక తన భవిష్యత్తు మొత్తం రాజకీయాలతోనే ముడి పడి ఉందని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చేసాడు.

దీనికి చాలా పెద్ద కసరత్తు మొదలెట్టాడు.ఇదిలా ఉంటే ఎన్నికలలో ఓటమి తర్వాత ప్రస్తుతం రాజకీయ సమీక్షలు అన్ని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ మరో కొత్త ఆలోచనకి శ్రీకారం చుడుతున్నట్లు అతని తాజా ప్రకటనతో స్పష్టం అయ్యింది.

ఓ వైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే సినిమాతో అనుబంధం కొనసాగించే విధంగా ప్లాన్ చేసుకున్నాడు.అందులో భాగంగా తాజాగా పాలకొల్లులో ఫిలిం స్కూల్ మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించాడు.

ఇక ఈ స్కూల్ కి ఎస్వి రంగారావు పేరు పెట్టబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేసాడు.ఎక్కువగా గోదావరి జిల్లాల నుంచి సినిమా రంగం వైపు నటులు, రచయితలు వస్తున్న నేపధ్యంలో అక్కడ ఉన్న అందరికి అందుబాటులో ఉండే విధంగా పవన్ కళ్యాణ్ స్టార్ చేసే ఫిలిం స్కూల్ ఉండబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఇక ఈ స్కూల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ బయటకి తీసుకొచ్చే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలోనే పవన్ ఈ ఫిలిం స్కూల్ ఏర్పాటుకి కూడా సిద్ధం అయినట్లు సమాచారం.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు