ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశ్వక్ సేన్.ఇక కుర్ర నటుడు తెలంగాణ స్లాంగ్ తో ఆ సినిమాలో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాడు.
ఇక తన రెండో సినిమాగా ఫలక్ నుమా దాస్ సినిమాని అతనే దర్శకుడుగా మారి తెరకెక్కించాడు.రిలీజ్ కి ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ లో సురేష్ బాబు దగ్గరుండి రిలీజ్ చేసాడు.
ట్రైలర్ లో హైదరాబాదీ నేటివిటీని పరిచయం చేసి తెలంగాణ యూత్ కి భాగా కనెక్ట్ అయిపోయాడు.దీంతో ఈ సినిమా థియేటర్ లో మరో అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు రేంజ్ లో హిట్ కొడుతుంది అని అందరూ భావించారు.
అయితే ఊహించని విధంగా ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యి ప్రస్తుతం కంప్లీట్ గా సైలెంట్ అయిపొయింది.
అయితే విశ్వక్ సేన్ ఈ సినిమాతో దర్శకుడుగా ఫ్లాప్ అయిన, తన స్టైల్ అఫ్ యాటిట్యూడ్ తో టాలీవుడ్ లో మరో విజయదేవరకొండ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.ఎరోగెంట్ స్టైల్ లో యూత్ కి కూడా భాగా కనెక్ట్ అయిపోయాడు.
నటుడుగా సినిమాలో మంచి మార్కులు సొంతం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ఈ హీరోపై ఇప్పుడు దర్శకులతో పాటు నిర్మాతల ద్రుష్టి పడింది.
నేచురల్ స్టార్ నాని ఇప్పటికే తన ప్రొడక్షన్ లో రెండో సినిమాకి హీరో విశ్వక్ సేన్ అని కన్ఫర్మ్ చేసేసాడు.ఇక తాజాగా టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.
టాలీవుడ్ సురేష్ ప్రొడక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా రానా ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక హీరోగా కనిపిస్తాడని సమాచారం.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
.