జవాన్ పై మరో జవాన్ కాల్పులు...జవాన్ మృతి

పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లా లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఒక జవాన్ పై మరో జవాన్ 18 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.

దీనితో ఈ ఘటనలో ఆ జవాను మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.అసోం రైఫిల్స్ జవాను లక్ష్మీకాంత్ బర్మాన్.

మరో జవాను భోలనాథ్ దాస్గా పై కాల్పులు జరిపాడు.దీనితో భోల నాథ్ ప్రాణాలు కోల్పోగా ఇదే ఘటనలో గాయపడ్డ అనిల్ రాజ్భన్సీ, రంతు మనిలను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల డ్యూటీ కోసం వీరంతా పశ్చిమ బెంగాల్ కు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే ఎందుకు కాల్పులకు పాల్పడ్డారు అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు.

Advertisement

మరోపక్క లక్ష్మీకాంత్ బర్మాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు