గోవాలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంకి అర్ధరాత్రి ఊహించని ఎదురుదెబ్బ

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం అనంతరం ఊహించని పరిణామాల మధ్య మళ్ళీ బీజేపీ సర్కార్ తన బలం నిరూపించుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే ఊహించని విధంగా ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇంకా కొన్ని రోజులు కాకుండానే సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి.

 Bjp Government Facing Struggles In Goa State-TeluguStop.com

మంగళవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు.

ఇందుకు సంబంధించిన లేఖను ఎంజీపీ ఎమ్మెల్యేలు మనోహర్‌ అజ్‌గావోంకర్, దీపక్‌ పావస్కర్‌లు గోవా అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్‌ మైఖేల్‌ లోబోకు మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటలకు అందజేశారు.అనంతరం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మరో ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్‌ ధవలికర్‌ను ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మంత్రివర్గం నుంచి తొలగించారు.

తమ పార్టీ శాసనసభాపక్ష వ్యవహారాల్లో బీజేపీ తలదూర్చి, కుట్రకు పాల్పడుతున్నందున సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్‌ ధవలికర్‌ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.దీంతో ఇప్పుడు బీజేపీ సంకీర్ణ సర్కార్ బలం ఒకటి తగ్గింది.ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube