టీడీపీని నిర్వీర్యం చేయడానికి ఢిల్లీ వేదికగా కుట్ర! వాస్తవాలు బయటపెట్టిన చంద్రబాబు!

ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసి, లాభపడాలని చూస్తూ ఢిల్లీ వేదికగా కుట్రకి తెరతీసి దాని కోసం ప్రతిపక్ష పార్టీ వైసీపీని వాడుకున్తుందని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వాఖ్యలు చేసారు.

డేటా చోరీ వ్యవహారంపై తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు తనకి వ్యతిరేకంగా జరిగిన కుట్రని బయటపెట్టారు.

వైసీపీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసినపుడే కుట్రకి తెరతీసారని, ఎలాంటి ఫిర్య్తాదు లేకుండా ఐటీ గ్రిడ్ సంస్థపైన దాడులు చేసారని బాబు ఆరోపించారు.అలాగే నిజాలు బయట పడతాయని మార్చి 2న అర్ధరాత్రి హడావిడిగా కేసు నమోదు చేసారని బాబు ఆరోపించారు.

దొంగతనంగా డేటా అంతా తీసుకొని ఇప్పుడు తిరిగి తమపైన ఫిర్యాదు చేసి విచారించే స్థాయికి కుట్రలు చేస్తున్నారని, దీనికి తెలంగాణ ప్రభుత్వం అండదండలు వున్నాయని బాబు విమర్శించారు.ఇదంతా ఒక యాక్షన్ ప్లాన్ లో భాగంగా జరుగుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇక వైసీపీ పార్టీకి టీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఇచ్చిందని కూడా చంద్రబాబు చెప్పారు.

Advertisement
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

తాజా వార్తలు