ఢిల్లీ వేదికగా వైసీపీని కార్నర్ చేసిన చంద్రబాబు! మరికొద్ది సేపట్లో రాష్ట్రపతిని వినతి!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీ వేదికగా ప్రత్యెక హోదా ఉద్యమానికి తెరతీసి కావాల్సిననత మైలేజ్ ని ఎన్నికల ముందు సొంతం చేసుకుంటున్నాడు.ప్రత్యెక హోదా, విభజన హామీలపై ఇప్పటి వరకు వైసీపీ, జనసేన, టీడీపీ ఎవరి పంథాలో వారు ఉద్యమం చేస్తున్నారు.

 Ap Cm Going To Meet President Of India For Special Status Demand-TeluguStop.com

అయితే ఢిల్లీ వేదికగా చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షని విపక్షాల నుంచి మద్దతు లభించడంతో పాటు, నేషనల్ మీడియా ద్రుష్టి ని కూడా ఆకర్షించారు.దీంతో ప్రత్యెక హోదా సాధన కోసం టీడీపీ పార్టీ చేస్తున్న పోరాట ఉద్యమానికి ఏపీలో కూడా ప్రజల నుంచి సానుకూలత లభించింది.

ఇదిలా వుంటే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ నుంచి రాష్ట్ర పతి భవన్ వరకు పాదయాత్ర చేసి ప్రత్యెక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేసారు.అలాగే రాష్ట్రపతి భవన్ లో 11 సభ్యుల బృందంతో కలిసి ప్రత్యెక హోదా, విభజన హామీలకి సంబంధించిన 18 డిమాండ్ల పత్రాల్ని రాష్ట్రపతికి అందించేసారు.

ఈ బృందంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు కూడా ఉంటారని నేషనల్ మీడియాతో చంద్రబాబు చెప్పడం జరిగింది.అదే సమయంలో బీజేపీకి వైసీపీ మద్దతుగ వుండటం కారణంగా, అవినీతి కేసుల నుంచి బయటపడటానికి మోడీ తొత్తులుగా వైసీపీ నాయకులు మారిపోయారని చంద్రబాబు ఘాటు విమర్శలు చేసారు.

మరి ఢిల్లీ వేదికగా వైసీపీప బాబు చేసిన విమర్శలకి ఆ పార్టీ ఎం సమాధానం చెబుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube