మనం బస్ ఎక్కాలంటే ముందుగా కావాల్సింది డబ్బులు.డబ్బులు ఉంటేనే బస్సులో ప్రయాణం సాధ్యమవుతుంది.
మనం ప్రయాణించే ప్రాంతానికి నిర్ణీత సొమ్ము చెల్లించి టికెట్ కొంటూ ఉంటాము.అలా కాకుండా ప్రయాణిస్తే కండక్టర్ కి కోపం వచ్చి మనల్ని నిర్ధాక్షిణ్యంగా దించేస్తాడు.
కానీ ఓ దేశం లో అటువంటి ఛాన్స్ ఉండదట.ఎందుకంటే.? అక్కడ అందరికి బస్ ప్రయాణం ఉచితం చేసేస్తున్నారు.
యూరప్ లోని లక్జంబర్గ్ దేశంలో అందరికి ఉచితంగానే ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.2020 నాటికి ఈ విదానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు.దేశంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి గాను ఈ ఆలోచన చేస్తున్నారట.
టిక్కెట్ ఉండదంటే అంతా పబ్లిక్ ట్రాన్స్ పోర్టుపై ఆదారపడతారన్నది వారి ఆలోచన అట.కానీ ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి.