లగడపాటి సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకుంటారు

టీఆర్ఎస్ పార్టీ నాయకులు లగడపాటి రాజగోపాల్ పేరు చెప్తే చాలు… ఒంటి కాలిమీద లేస్తున్నారు.తెలంగాణాలో ఎన్నికల పర్వం ముగిసిన తరువాత లగడపాటి ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టడం… ఆ తరువాత ఆయన మీద టీఆర్ఎస్ నాయకుల ఎదురుదాడి జరగడం రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాము.

 Ktr Coments On Lagadapati Rajagopal Surveys-TeluguStop.com

తాజాగా టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మహాకూటమిలోని పార్టీలు చేస్తున్న ఆరోపణల మీదా… లగడపాటి రాజగోపాల్ మీద తనదయిన శైలిలో సెటైర్లు వేశారు.

పోలింగ్ అయిన తర్వాత స్ట్రాంగ్‌రూమ్‌లపై, ఈవీఎంలపై మహాకూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్టూ కుంటి సాకులు వెతుక్కుంటున్నారని కేటీఆర్ విమర్శించారు.తాము ప్రజల్లో మాత్రమే స్ట్రాంగ్‌గా ఉన్నామని.స్ట్రాంగ్‌ రూమ్‌లతో మాకు పనిలేదన్నారు.

లగడపాటి రాజగోపాల్ ఎక్జిట్ పోల్ జరపకుండానే అంచనాలు ప్రకటించారని ఆయన ఆరోపించారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్‌.

ఫలితాల తర్వాత సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube