డబ్బులు విత్ డ్రా చేయడానికి మనం ఏ.టి.
ఎమ్ కు వెళ్తూ ఉంటాము.పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుండి ఏ.టి.ఎమ్ లో పెద్దగా డబ్బులు ఉండట్లేదు అనుకోండి.బయట “నో కాష్” బోర్డు లేదు అంటే అది మన అదృష్టమని చెప్పాలి.కానీ ఓ వ్యక్తికి మాత్రం డబ్బులు డ్రా చేద్దామని వెళ్తే…డబ్బులు వచ్చాయి.అందులో తప్పేముంది.మంచి విషయమే కదా అనుకోకండి.
అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.డబ్బులతో పాటు ఓ చిత్తు కాగితం వచ్చింది.
పశ్చిమబెంగాల్లోని హౌరా జిల్లా బాలీలో ఘటన జరిగింది.సోషల్ మీడియాలో ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది.
వివరాలలోకి వెళ్తే.విజయ్ పాండే అనే వ్యక్తి డబ్బు తీద్దామని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు వెళ్లాడు.రూ.6వేలు డ్రా చేద్దామని.మెషిన్లో కార్డు పెట్టాడు.పిన్ నెంబర్ నొక్కి.డబ్బు బయటకు రాగానే తీసి చూశాడు.అంతే అతడికి షాక్ తగిలింది.మెషిన్లో నుంచి రూ.4వేలే వచ్చాయి.అది కూడా రెండు రూ.2వేల నోట్లు.ఆ రెండు నోట్ల మధ్యలో ఓ చిత్తు కాగితం వచ్చింది.దీంతో షాకైన విజయ్ పాండే నేరుగా బ్యాంకుకు వెళ్లాడు.జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పాడు.ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.
ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారట.బ్యాంక్ ఏటీఎంలో ఇలా చిత్తు కాగితం రావడం ఏంటని బ్యాంక్ అధికారులు కూడా షాక్ అవుతున్నారట.
ఇలా ఇంకెన్ని అవకతవకలు జరుగుతూ ఉంటాయో ఏమో.మొన్నేమో దొంగ నోటు.ఇప్పుడేమో చిత్తు కాగితం.కస్టమర్లను మాత్రం షాక్ కు గురిచేస్తున్నారు బ్యాంకు సంస్థలు.