ఇది నిజంగానే జగన్ మోహన్ రెడ్డి అభిమానులకి శుభవార్త అనే చెప్పాలి.ఎందుకంటే అక్రమంగా జగన్ పై దాదాపు 11 కేసులు పెట్టి జైలుకి పంపించి ఎన్నో ఇబ్బందులకి గురిచేసి రాక్షస ఆనందం పొందారు.
అయితే ఈ కేసుల వ్యవహారాల వెనుక టిడిపి హస్తం కూడా ఉంది అనేది వైసీపి వర్గాలు ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నాయి.అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ అల్లుకుని ఉన్న కేసుల వలయంలో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పొర విడిపోతూ వస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి పై సీబీఐ పెట్టిన కేసులకి తగిన ఆధారాలు లేవని అంటూనే.సీబీఐ ఆధారాలు సేకరించడంలో విఫలం అవుతోందని కోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ పై పెట్టిన కేసులు అన్ని తప్పుడు కేసులే అని తేటతెల్లం అవుతోంది.జగన్ తో సహా అభియోగాలు ఎదుర్కుంటున్న ఐఏఎస్ అధికార్లకు క్లీన్ చిట్ దక్కుతోంది…ఈ క్రమంలోనే తాజాగా లేపాక్షి హబ్ భూముల కేటాయింపునకు సంబంధించి అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డికి తాజాగా హైకోర్టులో ఊరట లభించడం ఇందుకు నిదర్శనం
అయితే లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు సంబంధించిన కేసులో మురళీధర్ రెడ్డి 12 వ నిందితుడు…ఈ కేసులో నాకు ఎటువంటి సంభందం లేదు అని నా పేరుని ఈ కేసులోనుంచీ తొలగించాలని మురళీధర్ కోరడంతో హైకోర్టు మురళీధర్ రెడ్డి మీద విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది…అయితే కేవలం మురళీధర్ విషయంలోనే కాదు జగన్ కేసులలో నిందితులుగా ఉన్న ఎంతో మంది అధికారుల విషయంలో సైతం కోర్టుల నుంచీ మినహాయిపు వచ్చింది…అన్ని కేసులలో కూడా అధికారుల పాత్ర ఉందని నిరూపించడంలో సీబీఐ విఫలం అయ్యిందని తెలుస్తోంది.
అయితే జగన్ పై నమోదు చేసిన కేసుల్లో “క్విడ్ ప్రోకో” అంటూ కేసులో నమోదు చేశారు కానీ చివరికి ఎక్కడ, ఏ సందర్భంలో ఈ క్విడ్ ప్రోకో జరిగిందో మాత్రం ఆధారాలు చూపించలేక పోతున్నారు.
ఇదిలాఉంటే ఇప్పటికి జగన్ పై నమోదైన కేసులు 11 కాగా వాటిలో ఇప్పటికే 9 కి క్లీన్ చీట్ వచ్చింది ఇక మిగిలినవి 2 కేసులు ఇవి కూడా త్వరలోనే పరిష్కారం అయ్యి జగన్ చుట్టూ ఉన్న మబ్బులు అన్నీ తొలగి పోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపి అభిమానులు
.






