కొంత మంది ముఖం ఎంత శుభ్రం చేసుకున్న ముఖం మీద జిడ్డు అలానే ఉండిపోతుంది.ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటే ముఖం తొందరగా నల్లగా మారిపోతుంది.
బయటకు వెళ్ళినప్పుడు జిడ్డు చర్మం మీద దుమ్ము,ధూళి చేరి మరింత నల్లగా కనపడుతుంది.ముఖం మీద జిడ్డు తొలగిపోయి ముఖ చర్మం తెల్లగా,కాంతివంతంగా ఉండాలంటే ఈ చిట్కాను ట్రై చేయండి.
ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.ఈ చిట్కా ముఖం మీద నలుపును,మృతకణాలను తొలగించటంలో సహాయపడుతుంది.
ఈ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం.
వాసెలిన్వాసెలిన్ ను సాధారణంగా చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచటానికి ఉపయోగిస్తాం.
పగిలిన చర్మాన్ని,పెదాలను మరమత్తు చేసి మృదువుగా మారేలా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది.అంతేకాకుండా చర్మంలోని మలినాలను,తాన్ తొలగించుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది.
ముఖం మీద పేరుకుపోయిన మలినాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
రోజ్ వాటర్రోజ్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్,యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టిరియాలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇందులో కూడా అనేక రకాల విటమిన్స్ ఉన్నాయి.ఇది చర్మంపై బ్యాక్టీరియాను నలుపును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది.
ఇదిచర్మ కాంతిని ఫెయిర్ గా ఉంచటంలో సహాయపడుతుంది.
విటమిన్ E క్యాప్సిల్విటమిన్ E క్యాప్సిల్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటుంది.
విటమిన్ E క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి.చర్మంలో మృత కణాలను తొలగించి చర్మ కాంతిని మెరుగుపరచటంలో సహాయపడుతుంది.
చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది.చర్మానికి సరైన పోషణ అందితే చర్మం ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంటుంది.
ఈ పదార్ధాలు అన్ని బాగా కలిసేలా బాగా కలపాలి.ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి,మెడకు అప్లై చేసుకొని అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేసుకుంటూ ఉంటె మంచి ఫలితం కనపడుతుంది.ప్రతి రోజు ఇలా చేయటం కుదరని వారు వారంలో మూడు సార్లు అప్లై చేసిన మీ ముఖంపై నలుపు,మలినాలు,మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా,తెల్లగా మెరుస్తుంది.
చూసారుగా ఫ్రెండ్స్ మీ ముఖంపై జిడ్డును,నలుపును తొలగించుకోవడానికి ఈ చిట్కాను తప్పకుండా ట్రై చేయండి.