శ్రీదేవి కూతురు జాహ్నవి ఇంకా సినిమాల్లోకి రానేలేదు.అయినా ఈ ఇరవై ఏళ్ళ సుందరి ఇప్పటికే ఫేమస్ అయిపోయింది.
దానికి కారణం అవసరం లేని విషయాలతో వార్తల్లో నిలవడమే.ఇద్దరేసి బాయ్ ఫ్రెండ్లు, వారితో ముద్దులు పెడుతూ ఫోటోలు .ఇవి కాకుండా ఇంస్టాగ్రామ్ అకౌంట్లో హాట్ హాట్ పోస్ట్లు .వీటి మూలానే ఇన్నిరోజుల నుంచి వార్తల్లో ఉంటూ వచ్చింది జాహ్నవి.
ఇక ఈ అమ్మడు త్వరలోనే బాలివుడ్ లోకి ఎంట్రి ఇవ్వనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతానికి హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అనే విషయాలు బయటకి రాలేదు కాని, నిర్మాత మాత్రం కరణ్ జోహర్.
తన బ్యానర్ లోనే తొలి సినిమా చేయనుంది శ్రీదేవి కూతురు.
జాహ్నవి మాటిమాటికి తన హాట్ ఫోటోలు పెట్టడం శ్రీదేవికి నచ్చడం లేదట.హీరోయిన్ గా ఎదిగేంత వరకు ఇలా సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టడం మానుకోవాలని, జనాలకు ఆసక్తి ఉండాలి అంటే సినిమాల్లోకి వచ్చేంత వరకు పెద్దగా కనిపించకుండా, వార్తల్లో నిలవకపోతేనే మంచిది అని శ్రీదేవి గట్టిగానే మందిలించిందట.
అంతేగా .సినిమాల్లోకి వచ్చాక ఎంత గ్లామరస్ గా కనిపించినా నడుస్తుంది కాని ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే గ్లామర్ ఒలికించేస్తే జనాలకి ముందే బోర్ కొట్టేయ్యదూ!
.