రాష్ట్రానికి కేంద్రం రూ.90వేల కోట్లు ఇచ్చిందంటూ భాజపా అధ్యక్షుడు అమిత్షా ప్రచారం చేయటం పట్ల తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మండి పడ్డారు.శనివారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.తెలంగాణ ప్రజలకు మోసం చేసేందుకు అమిత్ షా సిద్దమవుతున్నట్లుందని గత రెండేళ్లలోరాష్ట్రానికి వాటాగా వచ్చిన నిధులు రూ.36వేల కోట్లు మాత్రమే అని వీటిని నిరూపించేందుకు తాము రడీ అన్నారు.తెలంగాణకు 90 వేల కోట్లు ఎప్పుడెప్పుడిచ్చారో? లెక్కలున్నాయని చెప్తున్న అమిత్షా ధైర్యముంటే వాటిని వెల్లడించాలని సవాల్ విసిరారు.
ప్రభుత్వాలకు మానవీయ కోణం ఉండాలని.ఛాయ్ వాలా ప్రధానమంత్రి అని గల్లీ గల్లీకి ప్రచారం చేశారు మినహా ఈ దేశంలో యువత కోసం బీజేపీ ఏం చేసిందని నిలదీసారాయన.
తమది పేదల ప్రభుత్వం మని .చెప్పిన పెద్దలు కార్పొరేట్లకు సేవలందిస్తున్న విషయాన్ని మరచిపోతే ఎలా అన్నారు.భాజపా అర్ధంతరంగా వదిలేస్తున్న కేంద్ర పథకాలను తాము తలకెత్తుకుని కొనసాగిస్తున్నామని, ఇందుకు మోడల్ స్కూళ్లే ఉదాహరణ అన్నారు.