వెస్ట్ బెంగాల్ ప్రజలు దీదీకి మరోసారి ఘనవిజయం కట్టబెట్టారు.మమత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా జనం పట్టించుకోలేదు.
రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని విమర్శలు చెలరేగినా ప్రజలు ఖాతరు చేయలేదు.గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించారు.
మమతను మట్టి కరిపించాలని కమ్యూనిస్థులు, కాంగ్రెస్ తమ శత్రుత్వాన్ని మర్చిపోయి, సిద్ధాంతాలను పక్కకు పెట్టి పోటీ చేసినా మమత విజయాన్ని ఆపలేకపోయారు.ప్రతిపక్షాలు చేసిన అవినీతి ఆరోపణలను సామాన్య ప్రజలు నమ్మలేదని మమత అన్నారు.
బెంగాల్లో శారదా చిట్ ఫండ్ కుంభ కోణం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.







