మన దేశంలో చదువుకోని వారే కాకుండా చదువుకున్న వారు కూడా ఓటు వేయరు.కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు తాము జీవితంలో ఏనాడూ ఓటు వేయలేదని గర్వంగా చెప్పుకుంటారు.
ఇది గొప్పతనం కాదు.సిగ్గు పడాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉపయోగించుకోవడం కనీస బాధ్యత అనే విషయం రాజ్యంగ పదవుల్లో ఉండేవారు కూడా గుర్తించడంలేదు.
కేరళలో గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దీంతో ఇది ఆశ్చర్యకరమైన పెద్ద వార్త అయింది.కేరళ గవర్నర్, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సదాశివన్ ఈ రోజు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆయన అధికార నివాసానికి దగ్గరలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఓటు వేయడం తన బాధ్యత అని సదాశివమ్ అన్నారు.
ఈ నెల ప్రారంభంలో ఆయన ఓటరుగా నమోదు చేయించుకున్నారు.







