8 నెలల వయస్సులో ఉన్న పసిపాప అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేయడం, తల్లిదండ్రులను కూడా సరిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడం మనందరికీ తెలిసిందే.కానీ ఓ 8 నెలల చిన్నారి నోబెల్ ప్రపంచ రికార్డు( Nobel World Record ) బుక్ లో స్థానం సంపాదించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆ పసిపాపకు సంబంధించిన వివరాలు ఏమిటో.ఆ పసిపాప సాధించిన ఘనత ఏమిటో తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని మల్కాజిగిరి బలరాం నగర్( Malkajigiri Balaram Nagar ) లో నివాసం ఉంటున్న మణికంఠ, లక్ష్మీ ప్రసన్న( Manikantha, Lakshmi Prasanna ) దంపతులకు ఆద్యశ్రీ అనే 8 నెలల చిన్నారి సంతానం. ఆద్యశ్రీ ( Adyashri )పుట్టినప్పటి నుండి ఎంతో యాక్టివ్ గా ఉంటోంది.
కేవలం రెండు నెలల వయసు రాగానే ఈ చిన్నారికి అద్భుతమైన గ్రహకశక్తి ఉందనే విషయాన్ని ఈమె తల్లిదండ్రులు గ్రహించారు.ఒక తల్లిదండ్రులు ఆ చిన్నారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
చిన్నారికి మూడు నెలల వయస్సు రాగానే ఫోటోలు, రకరకాల వస్తువులు, దేశాలకు సంబంధించిన జెండాలను గుర్తించడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.ఇక క్రమంగా పాపకు వస్తువులను గుర్తుపట్టడం, ఫోటోలను గుర్తించడం అలవాటు అయింది.

ఆద్యశ్రీకి ప్రస్తుతం ఎనిమిది నెలల వయస్సు.ప్రస్తుతం పాప గ్రహక శక్తిని చూసి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఆద్యశ్రీ 300 రకాల ఫోటోలను గుర్తించగలుగుతుంది.కూరగాయలు, పళ్ళు, పూలు, వివిధ రకాల వస్తువులను సులభంగా గుర్తించగలుగుతుంది.అంతేకాకుండా 30 దేశాలకు చెందిన జాతీయ జెండాలను సైతం గుర్తుపడుతోంది.ఇక ఆద్యశ్రీ తల్లిదండ్రులు పాప గ్రహక శక్తిని రికార్డ్ చేసి నోబెల్ ప్రపంచ రికార్డు కోసం పంపారు.
చిన్నారి గ్రహకశక్తికి నోబెల్ ప్రపంచ రికార్డు బుక్ లో స్థానం దొరికింది.అంతేకాదు వివిధ రకాల సంస్థల నుండి ఈ చిన్నారికి పలు అవార్డులు, మెడల్స్ కూడా వచ్చాయి.
ఇంత చిన్న వయస్సులోనే నోబెల్ రికార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.







