బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ నిర్వహించిన ‘ రా కదలి రా’ సభలో( Ra Kadali Ra ) ఆ పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu )పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ( YCP ) ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని చంద్రబాబు అన్నారు.ల్యాండ్, శాండ్, మైన్, వైన్ … ఇలా దేన్నీ జగన్ వదలడం లేదని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వానికి ఇంకా 52 రోజులే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు.అక్రమ కేసులు టీడీపీ గెలుపును ఆపలేవని చెప్పారు.
అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తామని వెల్లడించారు.







