గ్రామ గ్రామాన గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో సర్వాయి పాపన్న 373 వా జయంతి వేడుకలను గౌడ కులస్తులు ఘనంగా జరిపారు.

బోయినపల్లి మండల కేంద్రం లో జరిగిన కార్యక్రమానికి మండల గౌడ సంగం నాయకులు హాజరై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలలు వేసి కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల గౌడ సంగం అధ్యక్షులు బొంగాని అశోక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని అన్నారు.

రాజుల‌పై తిరుగుబాటు చేసి బహుజనులకు అండగా నిలబడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తూ ఆశయాలను నెరవేర్చ డానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు పులి లక్ష్మీ పతి గౌడ్ ,గుంటి శంకర్,నాగుల శ్రీనివాస్,మెరుపుల గంగాధర్,నల్లగొండ అనిల్ కుమార్ ,కొండ కనుకయ్య, వికృతి ఆంజనేయులు, ముద్దం ప్రసాద్ , నాగుల వంశీ, నాగుల సాంబయ్య, పెరుమండ్ల నారాయణ,మెరుపుల అంజయ్య, కాసారపు మల్లేశం,బండారి మహేందర్,మెరుపుల జలంధర్ ,తదితరులు ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News