ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన "పెదరాయుడు" చిత్రం అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.

కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్, భానుప్రియ, సౌందర్య, రవీంద్ర బాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

కాగా ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ క్రమంలో దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా వసూళ్లని సాధించింది.కాగా ఇటీవలే ఈ చిత్రం విడుదలై 26 సంవత్సరాలు పూర్తవడంతో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను మరియు సినిమా షూటింగ్ ఫోటోలను చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.

దీంతో పలువురు మోహన్ బాబు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా ఈ విషయంపై తాజాగా యంగ్ హీరో మంచు మనోజ్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు.

Advertisement

ఇందులో భాగంగా చిత్ర యూనిట్ సభ్యుల కి శుభాకాంక్షలు తెలియజేశాడు.

అంతేకాకుండా 200 రోజులు ఫంక్షన్లో తీసినటువంటి ఫోటోలు షేర్ చేశాడు.అయితే ఈ ఫోటోలలో మంచు మనోజ్  తన తండ్రి మోహన్ బాబుతో పాటు ప్రముఖ సీనియర్ స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ రజినీకాంత్, నారా చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు మనోజ్ ప్రస్తుతం "అహం బ్రహ్మాస్మి" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

గత కొద్ది కాలంగా తన వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల కారణంగా మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించాడు.కాగా "అహం బ్రహ్మాస్మి" ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ పనులలో వాయిదా వేయడంతో కొంతమేర ఆలస్యం అయింది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు