దస్తగిరికి 24 గంటల పోలీస్ భద్రత..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.ఈనెల 30వ తారీఖు లోపు కేసు విచారణ మొత్తం కంప్లీట్ కావాలని సుప్రీంకోర్టు సీబీఐకీ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 24 Hours Police Security For Dastagiri , Ys Vivekananda Reddy Case, Dastagiri,-TeluguStop.com

దర్యాప్తు చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో అరెస్టులు తప్పవని తెలుస్తోంది.ఆదివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి( Bhaskara Reddy ) అరెస్ట్ కావటం జరిగింది.

ఈ క్రమంలో సిబిఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవడం తెలిసిందే.

దీంతో కోర్ట్ అరెస్టు చేయకుండా విచారణ చేయాలని… ఆడియో వీడియో రూపంలో.అవినాష్ రెడ్డినీ( Avinash Reddy ) దర్యాప్తు చేయాలని సీబీఐ అధికారులను హైకోర్టు ఆదేశించడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి .తనకి వైయస్ అవినాష్ రెడ్డి మరియు భాస్కర రెడ్డి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయటం తెలిసిందే.దీంతో దస్తగిరికి 24 గంటలు ఇంటి వద్ద పోలీసు భద్రత కల్పించడం జరిగింది.

ఈ పరిణామంతో మొత్తం ఆరుగురు దస్తగిరికి భద్రతగా ఉన్నారు.ఈరోజు సాయంత్రం నుంచె నలుగురు పోలీసులు విధుల్లో చేరడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube