విశాఖ ఏజెన్సీలో మావోయిస్ట్ కాల్పులు! ఇద్దరు మావోల హతం

విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోలు పంజా విసిరారు.ఎన్నికల ముందు గిరిజన ప్రాంతాల ప్రజలని భయబ్రాంతులకి గురి చేసే ప్రయత్నంలో భాగంగా మావోలు రంగంలోకి దిగారని సమాచారం అందుకున్న గ్రే హౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

 2 Maoists Encounter In Vizag Agency-TeluguStop.com

అయితే విశాఖ ఏజెన్సీలో ఓ ప్రాంతంలో మావోయిస్టులు మాటు వేసి ఉన్నారని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా ఎదురు కాల్పులు చేసినట్లు తెలుస్తుంది.

దీంతో మావోల కాల్పులని తిప్పి కొట్టడానికి పోలీసులు కూడా తిరిగి ఎదురుకాల్పులు మొదలెట్టారు.

ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతం అయినట్లు తెలుస్తుంది.ఇంకా 20 మంది వరకు మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం.

ఇక మావోయిస్టుల మాటు వేసిన స్థలంగా అధిక సంఖ్యలో నాటు తుపాకులు కూడా లభ్యం అయినట్లు తెలుస్తుంది.ఇక ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ కి కూడా గాయాలు అయినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఎన్ కౌంటర్ పై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.మావోయిస్టులు అయితే నాటు తుపాకులు ఎందుకు ఉంటాయని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో వాస్తవాలు బయటకి తీయాలని కొరుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube