వినాయక చవితి వస్తోందంటే చాలు చాలా మంది.ఎలాంటి వినాయకుడిని పెట్టుకుందాం, ఎలాంటి డెకరేషన్ చేద్దాం అంటూ ఆలోచిస్తుంటారు.
అంతేనా అందరి కంటే మా గణపతి మంచిగా కనిపించాలి అంటూ ఎన్నెన్నో వెరైటీలు చేస్తుంటారు.కూరగాయల, కొబ్బరి కాయలు, జెమ్స్, అరటి పండ్లు, మట్టి, పసుపు, ఆకులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలా సవాలక్ష రకాల వినాయక విగ్రహాలను మనం చూసుంటాం.
అయితే ఇప్పుడు చూడబోయే గణపతి మాత్రం చాలా కాస్ట్లీ.అదేంటి అనుకుంటున్నారా.
అవునండి మనం చూడబోయేది భారీ బంగారం గణపతి మరి.ఇంట్లో పెట్టుకునేందుకో లేదంటే గుడిలో కొలువై ఉండేలా చేసేందుకో ఈ బంగారు గణపతిని తయారు చేయడం మనకు తెలుసు కానీ.నిమజ్జనానికి కూడా ఇలాంటి వినాయకులను వాడటం చాలా అరుదు.
ఉత్తర ప్రదేశ్ లోని ఛందౌసీని భారీ బంగారు గణనాథుడు రూపు దిద్దుకుంటున్నాడు.మేలిమి బంగారు కాంతులీనుతూ… భక్తుల పూజలు అందుకునేందుకు ముస్తాబు అవుతున్నాడు.18 అడుగుల ఎత్తు ఉండే ఈ స్వర్ణ గమేషుడిని బంగారం వినియోగించి తయారు చేస్తున్నారు.40 నుంచి 50 శాతం బంగారం, మిగతాది ఇతర లోహాలు ఉపయోగించి చేస్తున్నట్లు తయారీ దారులు తెలిపారు.కొవిడ్ ముందు ఇక్కడ భారీ ఎల్ఈడీ వినాయకుడు దర్శనం ఇవ్వగా… ఈ ఏడాది రానున్న స్వర్ణ గణేషుడిని స్వాగతించడానికి ఛందౌసీ వాసులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మరో రెండు మూడు రోజుల్లో ఈ భారీ బంగారు గణపతి పూర్తి కాబోతుంది.