కర్వేపాకు కోసిస్తానంటూ 11 ఏళ్ల బాలికపై దారుణం!

ప్రస్తుతం సమాజంలో రోజురోజుకు ఎన్ని దారుణమైన ఘటనలు జరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ భూమిపై స్త్రీలకే కాకుండా పసి పిల్లలకు కూడా స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది.

ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలే జరుగుతున్నాయ్. స్త్రీలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరగడమే తప్ప తగ్గడం లేదు.

ఇలాంటి నేరాలపై కోర్టు శిక్షలు విధించినా, ఎన్కౌంటర్ చేసిన కూడా ఘోరాలు మాత్రం ఆగట్లేదు.పసిపిల్లలు అని కూడా కొందరు మూర్ఖులు చాలా హీనంగా ప్రవర్తిస్తున్నారు.

ఇక అలానే 11 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కంకణం పాడుకి చెందిన రాయళ్ల మాలకొండయ్య అనే వ్యక్తి అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికపై మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Advertisement

ఆ బాలిక తల్లి ఇంట్లో లేని సమయాన వాళ్ళ ఇంటికి వెళ్లి మీ అమ్మ కరివేపాకు అడిగింది కోసిస్తాను అంటూ మాయమాటలు చెప్పి తన ద్విచక్రవాహనంపై పంట పొలాల దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ విషయం ఆ గ్రామంలో తెలియగా పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి ఆ బాలిక తల్లిని ఒప్పించి పరిహారంగా డబ్బులు చెల్లించేలా చేశారు ఆ గ్రామ పెద్దలు.

దీంతో సమాచారం తెలుసుకున్న సిఐ ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్ ఐ రాజ్ కుమార్ ఆ గ్రామంలోని పెద్దల ద్వారా నిందితుడి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు.కాగా ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

అయితే ఇలాంటి ఎన్నో దారుణమైన ఘటనలు ప్రతి చోటా జరుగుతున్నాయ్.కానీ ఎన్నో ఘటనలు పరువు గురించి ఆలోచించి గడపలోపలే ఉంటున్నాయ్.

మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి!.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు