దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు 1090 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కృష్ణ కిషోర్నాథ్ తెలిపారు.ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు ఈ సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు.
సాధారణంగా రోజూ హైదరాబాద్ నుంచి 344 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.దసరా సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.