కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.మైసూరులో ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడ్డారు.మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.