అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలి.

నల్లగొండ జిల్లా:అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేయాలని టిడిపి నల్గొండ జిల్లా పార్లమెంట్ బీసీ సెల్ కార్యదర్శి రాపర్తి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు.

మూడు సంవత్సరాల నుండి వేలాది మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మాత్రం నూతన పింఛను మంజూరు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.

మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పింఛన్లు మంజూరు చేయకపోవడం దుర్మార్గమన్నారు.వికలాంగులు,ఒంటరి మహిళలు, వృద్ధులు పింఛన్లు రాక నానా అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రతిఒక్కరికీ నూతన పింఛన్లు మంజూరు చేసి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు.

చైనాలో దారుణం : టాయిలెట్‌లో చిన్నారిని బంధించిన ఇద్దరు మహిళలు..
Advertisement

తాజా వార్తలు