ఆ రెండు కోట్లు నష్టం పవన్ చెల్లిస్తాడా మరి ?

సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చి ఎడాదికి దగ్గరవుతున్నా, ఆ నష్టాల కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

అప్పట్లో నష్టాలు వచ్చిన పంపిణీదారులంతా లబోదిబోమంటూ నిర్మాత శరత్ మరార్, హీరో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళితే, కాటమరాయుడు మీకే ఇప్పిస్తామని, ఆరకంగా నష్టాల్ని పూరిస్తామని చెప్పారు.

దాంతో డిస్ట్రీబ్యుటర్స్ కాస్త కుదుటపడ్డారు.కాటమరాయుడు బిజినెస్ మొదలైంది.

కాని ముందే చెప్పినట్లుగా, కృష్ణ జిల్లాలో సర్దార్ ని పంపిణీ చేసిన సంపత్ కుమార్ అనే పంపిణీదారుడికి కాకుండా వేరే వాళ్ళకి కృష్ణ హక్కులు కట్టబెడుతున్నారు.సంపత్ సర్దార్ ని కృష్ణ జిల్లా కోసం 4.50 కోట్లకు కొన్నారు.(అందులో 4.38 లక్షలు చెల్లించారు).కాని సర్దార్ కృష్ణలో 2.52 షేర్ మాత్రమే రాబట్టి ఆయనకు దాదాపుగా రెండు కోట్ల నష్టాల్ని మిగిల్చిందట.అయినా, కాటమరాయుడు తనకే ఇస్తున్నారు అన్న భరోసా ఇన్నాళ్ళు ఓపిక పట్టారట సంపత్.

కాని కథ అడ్డం తిరిగింది.సంపత్ కి హక్కులు ఇవ్వకపోవడమే కాకుండా, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోచడము, మెసెజ్లకి రిప్లై ఇవ్వకపోవడం చేస్తున్నారట.

Advertisement

గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారట.పవన్ కళ్యాణ్ ని నమ్మి తాను ఇన్నాళ్ళు ఓపిక పడితే నిర్మాత, పవన్ మనుషులు తనని ఇలా హింసిస్తున్నారని గోడు వెళ్ళబోసుకంటున్నాడు ఆ పంపిణీదారుడు.

మరి ఆ 2 కోట్ల నష్టం మన పవర్ స్టార్ చెల్లిస్తాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు