జియో కొత్త ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు

వచ్చీరాగానే 4G నెట్వర్క్ లో ఛత్రాధిపత్యం సంపాదించి, ఉచిత కాల్స్, ఉచిత ఇంటర్నెట్ తో ఇతర మొబైల్ నెటర్కింగ్ కంపెనీలకు నిద్రలేకుండా చేసిన జియో, ఇప్పుడు ఇంకొన్ని భారి అస్త్రాలను మార్కేట్లోకి వదలనుంది.అయితే ఈసారి దాడి మొబైల్ నెట్వర్క్ కంపెనీల మీద కాదు, ఏకంగా మొబైల్ కంపెనీల మీదే.

999 రూపాయలకు 4G నెట్వర్క్ తో పనిచేసే స్మార్ట్ ఫోన్ మార్కేట్లోకి వస్తే ఏం చేస్తారు? జనాలు ఎగబడి ఎగబడి, క్యూలో నిలబడి కొనేయరు! అదే జరగబోతోందేమో .ఎందుకంటే జియో నెక్స్ట్ ప్లాన్ అదే.ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని, 999 రూపాయలకు 4G స్మార్ట్ ఫోన్ అందించే దిశగా అడుగులు వేస్తోంది జియో.ఇప్పటికే కొన్ని చైనా మొబైల్ మ్యానుఫాక్చరర్స్ తో రిలయన్స్ సంస్థ చర్చలు మొదలుపెట్టింది.

అన్ని సక్రమంగా జరిగితే, రెండు చీప్ రేటు 4G ఫోన్లో మరికొన్ని నెలల్లో బయటకి రావచ్చు.ఒకటి 999 రూపాయలకు, రెండొవది 1500 రూపాయలకు.జియో అందిస్తున్న లైఫ్ స్మార్ట్ ఫోన్స్ కి కొనసాగింపే ఈ కొత్త సీరీస్.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు