నయన్‌ మొండి పట్టుదల

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార ఎప్పుడు ఏదో ఒక విషయంతో వివాదాస్పదం అవుతూనే ఉంటుంది.

ఇప్పటికే పలువురితో ప్రేమలో పడి, లేచి వార్తల్లోకి ఎక్కిన నయనతార తాజాగా మరో వివాదాస్పద నిర్ణయంతో మీడియా ముందుకు వచ్చింది.

తాజాగా ఈమెకు విక్రం సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది.అయితే ఆ అవకాశాన్ని నయన్‌ వద్దనుకుంది.

తాను విక్రం సరసన నటించను అని ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పాను అని, ఇప్పటికి అదే నిర్ణయంకు కట్టుబడి ఉన్నాను అంటూ షాక్‌ ఇచ్చింది.కొన్ని సంవత్సరా క్రితం నయనతార ఒక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో విక్రంకు జోడీగా నటించే అవకాశం వచ్చింది.

అయితే ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా పూర్తి చేసిన తర్వాత విక్రం సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.విక్రం వంటి స్టార్‌ హీరో సినిమాను పక్కన పెట్టి చిన్న హీరోతో సినిమా చేస్తావా అంటూ నిర్మాతలు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఆ సినిమాను పక్కకు పెట్టి, విక్రం సినిమాలో నటించమంటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.దాంతో ఆ సమయంలోనే ఇక కెరీర్‌లో తాను విక్రం సరసన నటించను అంటూ తేల్చి చెప్పింది.

అప్పటి నుండి కూడా పలు సినిమాకు విక్రంకు జోడీగా నయన్‌ను అనుకున్నారు.ఆమె నో చెప్పడం, ఆ తర్వాత మరో హీరోయిన్‌తో విక్రం సినిమా చేయడం జరుగుతుంది.

నయన్‌ ఎంత మొండిదో ఈ ఒక్క సంఘటనతో తెలుస్తుంది.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు