వంశీ తారక్ సినిమా అలా ఆగిందట..!

వక్కంతం వంశీ జూనియర్ ఎన్.టి.

ఆర్ ఇద్దరు మంచి స్నేహితులు.

తారక్ కోసం ఓ రేంజ్ కథను సిద్ధం చేసుకుని దాదాపు రెండేళ్లకు పైగా డైరక్షన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు వక్కంతం వంశీ.

ఇప్పుడు అప్పుడు అంటూనే జూనియర్ వంశీ సినిమా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు.తీరా ఫైనల్ గా మళ్లీ వక్కంతం వంశీకి హ్యాండ్ ఇచ్చాడట.అయితే దానికి కారణం సరైన కథ సెట్ అవ్వకనే అని అంటున్నారు.

అది ఎవరో చెప్పింది కాదు స్వయాన ఆ సినిమా నిర్మాతగా ప్రచారం జరిగిన కళ్యాణ్ రాం ఈ విషయాన్ని బయట పెట్టారు.వక్కంతం తారక్ తాను మంచి స్నేహితులమని ఓ సినిమా వల్ల ముగ్గురం బ్లేం అయ్యేలా కాకుండా సరైన కథతో వచ్చే ఆలోచనతోనే కాస్త లేట్ అవుతుందని అన్నారు.

Advertisement

తప్పకుండా అన్ని కుదిరితే వంశీతో సినిమా ఉంటుందని అన్నారు కళ్యాణ్ రాం.ప్రస్తుతం ఇజం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా సినిమా అవుట్ పుట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెబుతున్నారు కళ్యాణ్ రామ్.అదితి ఆర్య హీరోయిన్ గా నటించిన ఇజం మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు