‘బాహుబలి’ ముందు నిలిచేనా?

అల్లరి నరేష్‌ తాజా చిత్రం ‘జేమ్స్‌బాండ్‌’.ఈ సినిమాను గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా వేశారు.తాజాగా ఈ సినిమాను జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు.

అయితే అదే రోజు పలు చిన్న సినిమాలు ఉన్న నేపథ్యంలో ‘జేమ్స్‌బాండ్‌’ను వాయిదా వేశారు.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు.

జులై 17న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.‘బాహుబలి’ జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Advertisement

ఈ సినిమాకున్న క్రేజ్‌ దృష్ట్యా విడుదలైన రెండు వారాల వరకు మరే సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేవు అంటూ ప్రచారం జరిగింది.అయితే తాజాగా అల్లరోడు ‘జేమ్స్‌బాండ్‌’గా వచ్చేందుకు సిద్దం అవ్వడంతో అందరు కూడా షాక్‌ అవుతున్నారు.

‘బాహుబలి’ తుఫాన్‌ ముందు నిలిచేనా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు