వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వాయిదా పడింది.

హత్య కేసులో ముగ్గురు నిందితులను నాంపల్లి సీబీఐ కోర్టులో పోలీసులు హజరు పరిచారు.

నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డితో పాటు శివ శంకర్ రెడ్డిలను నాంపల్లి కోర్టులో హజరు పరిచారు.మరోవైపు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టు ఎదుట హాజరు అయ్యారు.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు