YS Sharmila : టీడీపీ..బీజేపీ..జనసేన పొత్తుపై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా పోటీకి దిగుతున్నాయి.

 Ys Sharmila Sensational Comments On Tdp Bjp Janasena Alliance-TeluguStop.com

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది.టీడీపీ.

జనసేన.బీజేపీ( TDP BJP Janasena ) మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన( TDP Janasena ) మాత్రమే పొత్తులో ఉన్నాయి.

నేడు బీజేపీ కూడా ఈ కూటమిలో కలవటం సంచలనంగా మారింది.ఏపిలో రాజకీయం 2014 మాదిరి పరిస్థితి నెలకొంది.

కాగా పొత్తులో భాగంగా బీజేపీ జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు చంద్రబాబు( Chandrababu )  కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.మిగిలిన స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారట.అయితే ఈ పొత్తులపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( AP Congress YS Sharmila ) సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.

అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )దొంగలేనని ఆమె ఆరోపించారు.అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో… చంద్రబాబు సమాధానం చెప్పా లని నిలదీశారు.

గతంలో ఐదేళ్లు పొత్తు పెట్టుకున్నారని అప్పుడు ఏపీకి ఏమి ఇచ్చారని ప్రశ్నించారు.అప్పుడు ఏమి సాధించారనేది కూడా ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube