హైదరాబాద్ ట్యాంక్బండ్పై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దీక్షకు దిగారు.ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు.
పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై షర్మిల నిరసన వ్యక్తం చేస్తున్నారు.తాను ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశాక ఇప్పుడు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తన పాదయాత్రకు హైకోర్టు కూడా అనుమతి ఇచ్చిందన్న ఆమె కేసీఆర్ న్యాయస్థానం ఆదేశాలనూ అగౌరవపరుస్తున్నారని విమర్శించారు.లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగించి ఉంటే 3,500 కిలోమీటర్ల మేర తిరిగేవాళ్లమా అని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రంలో కేవలం కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోందని పేర్కొన్నారు.