YCP Siddham Meeting : మార్చి మూడవ తారీకు వైసీపీ నాలుగో “సిద్ధం” సభ..!!

వైసీపీ నాలుగో “సిద్ధం” సభ( Siddham Meeting ) వేదిక ఖరారు అయింది.బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం( Addanki Constituency ) మెదరమెట్లలో మార్చి మూడవ తారీకు సభను నిర్వహించాలని వైసీపీ నిర్ణయించడం జరిగింది.

 Ycp Siddham Meeting : మార్చి మూడవ తారీకు వై�-TeluguStop.com

ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భీమిలి, కోస్తాంధ్రకి సంబంధించి దెందులూరులో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాప్తాడులో మూడు “సిద్ధం” సభలు జరిగాయి.ఈ మూడు సభలకు లక్షలలో జనాలు హాజరయ్యారు.

ఫిబ్రవరి 18వ తారీకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రాప్తాడులో జరిగిన “సిద్ధం” సభకి దాదాపు పది లక్షల మందికి పైగా జనాలు హాజరు కావడం జరిగింది.

250 ఎకరాలలో జరిగిన ఈ సభ వైసీపీ( YCP ) పార్టీ యొక్క బలాన్ని.తెలియజేయడం జరిగింది.దీంతో పల్నాడులో( Palnadu ) నిర్వహించబోయే నాలుగో “సిద్ధం” సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.2024 ఎన్నికలు వైసీపీ అధినేత వైఎస్ జగన్( CM Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.ఎన్నికల ప్రచారం విషయంలో… పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పక్క వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను నిత్యం ప్రజలలో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించారు.కాగా ఇప్పుడు “సిద్ధం” సభలతో.భారీ ఎత్తున బహిరంగ సభలో నిర్వహిస్తూ ఎన్నికలకు సై అంటున్నారు.ఈ క్రమంలో నాలుగో “సిద్ధం” సభ.పల్నాడులో నిర్వహించడానికి వైసీపీ రెడీ కావటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube