ఈ మధ్య కాలంలో ప్రముఖ సెలబ్రిటీల కుటుంబాల వారసులు, వారసురాళ్లు విడాకులకు సంబంధించిన వార్తల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.మరి కొందరు సెలబ్రిటీల విడాకులకు సంబంధించి వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే.
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ అంశం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకోలేదని ఆయన తెలిపారు.
ఆడపిల్లలపై అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ మగవాళ్లు ఫిజికల్ గా ఉన్నంత బలంగా అమ్మాయిలు ఉండరని అమ్మాయిలు చెడు అలవాట్లకు అలవాటు పడితే చదువు పాడవుతుందని అమ్మాయిలు పెళ్లైన తర్వాత కచ్చితంగా సిగరెట్ మానేయాలని యండమూరి సూచనలు చేశారు.అయితే సిగరెట్ మానేస్తే ఈ ఫ్రస్టేషన్ మరో విధంగా బయట పడుతుందని ఆయన తెలిపారు.
30 సంవత్సరాల తర్వాత అమ్మాయిలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగదని ఆయన చెప్పుకొచ్చారు.
డబ్బులు ఇవ్వకపోతే అమ్మాయిలు కొడుతున్న ఘటనలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.గారాబం వేరు ప్రేమ వేరు అని ఆయన తెలిపారు.తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
ఇంగ్లీష్ నవలల ఆధారంగా ఛాలెంజ్ కథ పుట్టిందని ఆయన తెలిపారు.
రాక్షసుడు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని ఆయన కామెంట్లు చేశారు.
కమర్షియల్ అంటే డబ్బులే కాదని టైమ్ వేస్ట్ చేసుకోకపోవడమని ఆయన తెలిపారు.
ప్రపంచంలో అన్నిటికన్నా సులభమైనది ఇతరులకు సలహాలివ్వడం అని ఆయన చెప్పుకొచ్చారు.చిరంజీవి నావాడు అని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు.నేను నవలలు రాసే సమయానికి మహిళా రచయిత్రులు రాయడం తగ్గించారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పుడు నవలలు రాసినా పుస్తకాలు అమ్ముడుపోవడం లేదని ఆయన వెల్లడించారు.వెన్నెల్లో ఆడపిల్ల ఏడు వారాల నవల అని దానిని పదిహేడు వారాల నవలగా మార్చానని ఆయన చెప్పుకొచ్చారు.