భరాసా పార్టీతో ఒత్తుపై పొత్తుపై రోజుకో రకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అయోమయంలో పడేస్తున్నారు .రేవంత్ రెడ్డి వర్గం కెసిఆర్ పార్టీతో పొత్తు సమస్య లేదని ఆ విషయం తమ నాయకుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi )కూడా స్పష్టం చేశారని ….
తెలంగాణ సహకారం కావడానికి ముఖ్యమైన కారణమైన కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసిన కెసిఆర్ తో కలిసి నడవాల్సిన అవసరం లేదంటూ ఈ నేతలు చెబుతుండగా జానారెడ్డి వర్గం మరొకరకంగా మాట్లాడుతుంది… పొత్తులపై కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవాలో లేదు ప్రజలు తెలుస్తారంటూ టిఆర్ఎస్తో పొత్తుపై ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయని ఆయన చెప్తున్నారు… అదేవిధంగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) కూడా హంగు లాంటి పరిస్థితి వస్తే సెక్యులర్ పార్టీలతోనే పొత్తు పెట్టుకోవాలని తెలంగాణలో సెక్యులర్ పార్టీ టిఆర్ఎస్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇలా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను అయోమయంలో పడేస్తున్నారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న సంకేతాలను టిఆర్ఎస్ నేతలు కూడా ఇస్తున్నారు రాహుల్ గాంధీ విషయంలో కూడా టిఆర్ఎస్ నేతలు ఒక మిత్రపక్షం లాగానే వ్యవహరిస్తూ వచ్చారు స్వామి కార్యం సౌకర్యం కూడా కలిసి వస్తుందని అంచనాలతో ఢిల్లీ వేదికగా మోదీ విధానాలను తూర్పురబడ్డారు.
దేశవ్యాప్తంగా బలమైన కార్యకర్తల సమూహ, ఆర్థిక అండదండలు ఉన్న భాజపాలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీ మిత్రుత్వం అవసరమని బారాసాధినాయకత్వం కూడా భావిస్తుంది…… రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఉండరు అవకాశం అవసరమే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది దానిని బట్టి చూస్తే శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి భాజపాలాంటి శత్రువుతో పోరాడాలంటే దాని శత్రువైన కాంగ్రెస్తో స్నేహం నడపాలని బారాస వ్యూహాలు( BRS ) రచిస్తుంది అందువల్ల పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి మరి కొద్ది రోజుల్లోనే ఈ పొత్తు వ్యూహాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది
.