23 సంవత్సరాల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న చిరు వెంకీ.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా?

టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే చిరంజీవి నుంచి మొదలుకొని వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ( Venkatesh, Nagarjuna, Balakrishna ) వంటి స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.

అయితే చిరంజీవి నటిస్తున్నటువంటి విశ్వంభర సినిమా మాత్రం విడుదల తేదీని కూడా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.బింబిసారా వంటి హిట్ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ వశిష్ట ( Director Vashishta )తన రెండవ సినిమానే చిరంజీవితో చేసే అవకాశాన్ని అందుకున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇదివరకే మేకర్స్ విడుదల తేదీని కూడా ప్రకటించారు.ఇక సంక్రాంతి పండుగ అంటేనే సినిమా పండుగ అని చెప్పాలి.

ఈ పండుగకు పెద్ద ఎత్తున సినిమాలు పోటీ పడుతూ విడుదల అవుతుంటాయి.ఈ క్రమంలోనే చిరంజీవికి( Chiranjeevi ) పోటీగా మరొక స్టార్ హీరో వెంకటేష్ సైతం బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతం వెంకటేష్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.అయితే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించకపోయిన 2025 సంక్రాంతి పండుగకు విడుదల కాబోతుందని తెలుస్తోంది.

ఇలా ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధమయ్యారు.అయితే వీరిద్దరూ 23 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ బరిలో దిగారు .చిరంజీవి నటించిన మృగరాజు, వెంకటేష్ నటించిన దేవీ పుత్రుడు సినిమాలు 2021 సంక్రాంతికి విడుదలయ్యాయి.అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.

మరి 23 సంవత్సరాలు తర్వాత పోటీకి సిద్ధమైన ఈ హీరోలు ఈసారైనా హిట్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

రష్యన్ యువతి కోరికలు విన్నారా.. ముందుగా అదే కావాలట..
Advertisement

తాజా వార్తలు