ఇటీవలే కాలంలో అక్రమ సంబంధానికి( Illegal relationship ) అడ్డుగా ఉన్న కుటుంబ సభ్యులను కిరాతకంగా కాటికి పంపించి తమ జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు కొందరు మూర్ఖులు.వివాహ బంధంతో ఒకటైన భార్యాభర్తలు బయటి వ్యక్తుల ఆకర్షణకు లోనై ఒకరినొకరు మోసం చేసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
సహజీవనం బయటపడడంతో భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కొత్తగూడెంలోని సన్యాసిబస్తికి చెందిన గాయపాక ప్రవీణ్ కుమార్ (35)కు, అదే ప్రాంతానికి చెందిన రేగాని లావణ్యతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది.ప్రవీణ్ కుమార్ పెయింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
వివాహం జరిగిన కొద్ది రోజులకు అదే బస్తీలో ఉండే తంగళ్ల సుమంత్ తో( Tangalla sumanth ) లావణ్య కు పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది.
ప్రవీణ్ కుమార్ కు ( Praveen kumar ) తన భార్య లావణ్య అక్రమ సంబంధం గురించి తెలిసి నిలదీయడంతో రెండు సంవత్సరాల క్రితం ప్రియుడుతో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది.
కొన్ని రోజులకు ప్రియుడుతో కలిసి బస్తీకి వచ్చి ఒక అద్దె ఇంట్లో సహజీవనం కొనసాగించింది.భర్త పెద్దమనుషుల వద్ద పంచాయతీ పెట్టిన, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది.తనకు విడాకులు ఇవ్వకుండా వేరే వ్యక్తితో సహజీవనం చేయడం ప్రవీణ్ కుమార్ కు నచ్చక విడాకులు ఇవ్వాలంటూ పలుమార్లు గొడవపడ్డాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి ప్రవీణ్ కుమార్, తన భార్య లావణ్య ఇంటికి వెళ్లి గొడవ పడడంతో, లావణ్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇద్దరినీ సర్ది చెప్పి ప్రవీణ్ కుమార్ ను ఇంటికి పంపించారు.
మరల ఆదివారం కూడా ప్రవీణ్ కుమార్, లావణ్య ఇంటికి వెళ్లాడు.లావణ్య రోకలి బండతో, లావణ్య ప్రియుడు ఇనుపరాడుతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకులడంతొ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.