టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు.టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీని సస్పెండ్ చేసి విచారించాలని తెలిపారు.
సిట్ దర్యాప్తులో పెద్ద మనుషులు బయటకు వచ్చే ఛాన్స్ లేదని మల్లు రవి వెల్లడించారు.ఒక్కొక్కరి నుంచి రూ.14 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీతో దర్యాప్తు చేయాలని కోరారు.
లేదా సిట్టింగ్ జడ్జితో కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.