తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా గుర్తింపు పొందిన వారిలో దివంగత సంగీత దర్శకుడు చక్రి( Chakri ) గారు ఒకరు.
ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించి సినిమాల విజయానికి తన వంతు కృషి చేశారు.సంగీత సారథ్యంలో తెరకెక్కిన సత్యం, శివమణి, ఇడియట్, దేశముదురు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాలు ఎంతో అద్భుతమైన హిట్ అందుకున్నాయి.
ఇలా సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి చక్రి ఉన్నఫలంగా 2014వ సంవత్సరంలో గుండెపోటుకు గురై మరణించారు.
ఇక ఈయన మరణించిన సమయంలో ఈయన మరణం పై ఎన్నో సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి.ఇకపోతే తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణన్( Mahith Narayan ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ చక్రి గురించి ఆయన భార్య గురించి పలు విషయాలను వెల్లడించారు.అన్నయ్య మరణం ఇప్పటికీ మా కుటుంబానికి తీరనిలోటు ఆయన ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు విభేదాలు లేవు.
ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు ప్రస్తుతం అన్నయ్య మరణం మమ్మల్ని ఎంతగానో కృంగదీసిందని తెలిపారు.
ఇక అన్నయ్య చనిపోయిన తర్వాత ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయి.అన్నయ్య సంపాదించిన ఆస్తులలో కొన్నింటిని వదిన అమ్ముకొని అమెరికా వెళ్లిపోయిందని అయితే అక్కడ ఆమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారని తెలిపారు.అయితే ప్రస్తుతం తనతో మాకు ఏ విధమైనటువంటి సంబంధాలు లేవని చక్రి ఈ సందర్భంగా తన అన్నయ్య భార్య గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక చక్రి వారసుడిగా మహిత్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పలు సినిమాలకు సంగీతం అందించారు.ప్రస్తుతం ఈయన సంగీతం అందించిన పరారి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన అన్నయ్య భార్య గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.