దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన యువతీయువకులు పెనుభారంగా మారుతున్నారు.అవును, నేటి యువతలో కామవాంఛలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
చదువు మీద దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రేమ పేరుతో వెర్రి వేషాలు వేస్తున్నారు.తల్లిదండ్రులు తమ తాహతుకు మించి వారిని చదివిస్తున్నా, వారు ఆ విషయాన్ని మరిచి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు.
ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు.తాజాగా, ఇంటర్ చదివే ఓ బాలిక, ఓ బాలుడు బరితెగించారు.
ఏకంగా బస్టాండ్ ని వారి పెళ్లి వేదిక చేసుకున్నారు.ఈ సంఘటన తమిళనాడులో జరగగా సోషల్ మీడియా వేదికగా సదరు వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.తమిళనాడులోని చిదంబరానికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది.
అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు.కొద్దిరోజుల నుండి వీరు బాగా చనువుగా తిరుగుతున్నారు.
ఈ క్రమంలో ఇద్దరూ గాంధీ విగ్రహం దగ్గరలో ఉన్న ఓ బస్టాండ్ దగ్గర కలుసుకొని, బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు.పక్కనే ఉన్న మరికొందరు వారికి మద్దతుగా అల్లరి చేస్తూ.పూలు చల్లారు.
అక్కడే వున్న ఓ స్టూడెంట్ దీన్నంతా వీడియో తీయగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియో ఎక్కడెక్కడికో వెళ్లి, చివరికి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.దాంతో వారు ఆ వీడియోపై సీరియస్ అయ్యారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.తాజాగా ఆ యువకుడ్ని, యువతిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.ఇటీవలికాలంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి.కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.