గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ రెండవ భార్య అయిన విజయ నిర్మల మృతి చెందిన విషయం తెల్సిందే.దర్శకురాలిగా గిన్నీస్ రికార్డును దక్కించుకున్న విజయ నిర్మల ఎన్నో అద్బుత చిత్రాలను తెరకెక్కించారు.44 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆమె ఎన్నో మంచి సినిమాల్లో హీరోయిన్గానూ నటించారు.ఆమె మృతి తెలుగు సినిమా పరిశ్రమకే కాకుండా ఇండియన్ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు అని చెప్పుకోవచ్చు.
తెలుగు జాతి గర్వించేలా చేసిన ఆమె విగ్రహ ఆవిష్కరణ జరుగబోతుంది.

నానక్రామ్ గూడాలోని ఆమె ఇంట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యారు.విగ్రహంను ఏర్పాటు చేయడంతో పాటు ఆ ఇంటిని సినిమా పరిశ్రమ మ్యూజియంగా మార్చాలని నిర్ణయించారు.రేపు ఆమె మొదటి జయంతి సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని నిర్ణయించారు.
అందుకోసం మహేష్బాబు హాజరు అవ్వబోతున్నాడు.నాన్న కృష్ణ కోసం మహేష్బాబు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరు కాబోతున్నాడు.

పెద్ద ఎత్తున ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని, ఎంపీ సంతోష్ ఇంకా ఎమ్మెల్యేలు మరియు కొందరు మంత్రులు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.







